తల్లి క్యాన్సర్ చికిత్స కోసం.. కన్యత్వాన్ని అమ్ముకునేందుకు సిద్ధమైన 11 ఏళ్ల బాలిక..!

కన్న తల్లికి క్యాన్సర్ ఉంది.. చికిత్స చేసేందుకు లక్షల్లో డబ్బులు కావాలి.. కాని అంత డబ్బు లేదు. ఏం చేయాలో తెలియడం లేదు. తల్లి చికిత్సకు డబ్బు కోసం వ్యభిచారం చేసేందుకు సిద్ధమైంది ఓ 11 ఏళ్ల చిన్నారి.. చివరికి పోలీసుల ఎంట్రీతో క్షేమంగా బయటపడింది. ఈ ఘటన మహారాష్ట్రలోని నాగపూర్ జిల్లాలో చోటుచేసుకుంది. 

వివరాల మేరకు.. నాగపూర్ లోని ఓ ప్రాంతంలో ముగ్గురు మహిళలు ఓ అపార్ట్ మెంట్ అద్దెకు తీసుకుని గుట్టుచప్పుడు కాకుండా వ్యభిచారం నిర్వహిస్తున్నారు. వీరు ఓ కస్టమర్ తో బేరం కుదుర్చకున్నారు. అమ్మాయిని ఏర్పాటు చేసేందుకు 40 వేల రూపాయలు తీసుకున్నారు. ఆ అమ్మాయిని కరోడిలోని ఒక అపార్ట్మెంట్ కు తీసుకెళ్లారు. అయితే బేరం కుదుర్చుకున్న వ్యక్తి పోలీస్ ఇన్ఫార్మర్ కావడంతో పోలీసులకు సమచారం ఇచ్చాడు. వెంటనే అపార్ట్మెంట్ కు చేరుకున్న పోలీసులు వారిని అదుపులోకి తీసుకున్నారు. 

ఆ 11 ఏళ్ల బాలికును చూసిన పోలీసులు షాక్ అయ్యారు. విషయం ఏంటని ఆరా తీశారు. దీంతో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. నాగపూర్ కు సమీపంలో నివసిస్తున్న మైనల్ బాలిక తల్లి క్యాన్సర్ తో బాధపడుతోంది. చికిత్స కోసం లక్షల్లో డబ్బులు కావాలి. దీంతో ఓ మహిళ పని ఇప్పిస్తానని తల్లితో చెప్పి తీసుకొచ్చింది. తర్వత తాను వ్యభిచారం చేస్తే రూ.5000 ఇప్పిస్తానని చెప్పడంతో వేరేదారిలేక ఆ బాలిక అందుకు అంగీకరించింది. ఇష్టం లేకపోయిన తల్లి చికిత్సకు డబ్బులు అవసరం ఉండటంతో ఆ పాడుపనికి ఒప్పుకుంది ఆ బాలిక..   

   

 

Leave a Comment