దేశంలో నిరుద్యోగం ఏ స్థాయిలో ఉందో చెప్పేందుకు ఈ ఘటనే నిదర్శనం.. మధ్యప్రదేశ్ లోని గ్వాలియర్ లో ప్యూన్లు, డ్రైవర్లు, వాచ్ మెన్ ఉద్యోగాలు మొత్తం 15 పోస్టులు ఉన్నాయి. ఈ ఉద్యోగాలకు 10వ తరగతి ఉత్తీర్ణులైన అభ్యర్థులు అవసరం. కానీ ఈ ఉద్యోగాలకు గ్రాడ్యుయేట్లు, పోస్ట్ గ్రాడ్యుయేట్లు, ఇంజనీర్లు, ఎంబీఏ, పీహెచ్ డీ పట్టభద్రులు కూడా దరఖాస్తు చేసుకున్నారు.
మధ్యప్రదేశ్ ప్రభుత్వం మాత్రం 15 పోస్టుల నియామకాలకు మాత్రమే నోటిఫికేషన్ జారీ చేసింది. కానీ ఈ 15 పోస్టులకు 11 వేల మంది దరఖాస్తు చేసుకున్నారు. సివిల్ జడ్జి ఉద్యోగం కోసం సిద్ధమవుతున్న వారు కూడా దరఖాస్తు చేసేందుకు వచ్చారు.